కాంగ్రెస్ సీనియర్ నేత ని కలిసిన రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే.మొన్న జానారెడ్డితో భేటీ అయినా రేవంత్ రెడ్డి తాజాగా వి హనుమంత రావు తో సమావేశమయ్యారు.

 Tpcc Rewanth Reddy Meets Senior Congress Leader V Hanumantha Rao , Rewanth Reddy-TeluguStop.com

ఆయనను కలిసిన తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన .గత కొన్ని రోజుల నుండి విహెచ్ కి అనారోగ్యం కారణం మామూలుగా పరామర్శించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పినట్లు .ఒకపక్క హాస్పిటల్లో ఉన్నాగాని మరోపక్క ప్రజా సమస్యలపై పోరాడినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అంతమాత్రమే కాదు రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పై పోరాడాలని తనకి సూచించినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అదే రీతిలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం విషయంలో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .త్వరలోనే సోనియా గాంధీ వద్దకు కలిసి వెళ్దాం అని చెప్పినట్లు స్పష్టం చేశారు.అదే సమయంలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం తొలగించి దానిని పోలీస్ స్టేషన్లో పెట్టారని విమర్శించారు.

Telugu Dalits, Jana Reddy, Panjagutta, Rewanth Reddy, Sonia Gandhi, Tpcc, Vhanum

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వం అన్న రీతిలో రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube