తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే.మొన్న జానారెడ్డితో భేటీ అయినా రేవంత్ రెడ్డి తాజాగా వి హనుమంత రావు తో సమావేశమయ్యారు.
ఆయనను కలిసిన తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన .గత కొన్ని రోజుల నుండి విహెచ్ కి అనారోగ్యం కారణం మామూలుగా పరామర్శించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పినట్లు .ఒకపక్క హాస్పిటల్లో ఉన్నాగాని మరోపక్క ప్రజా సమస్యలపై పోరాడినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అంతమాత్రమే కాదు రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పై పోరాడాలని తనకి సూచించినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అదే రీతిలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం విషయంలో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .త్వరలోనే సోనియా గాంధీ వద్దకు కలిసి వెళ్దాం అని చెప్పినట్లు స్పష్టం చేశారు.అదే సమయంలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం తొలగించి దానిని పోలీస్ స్టేషన్లో పెట్టారని విమర్శించారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వం అన్న రీతిలో రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.