టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన క్రాక్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.గత కొన్ని రోజులుగా ప్లాప్ లతో సతమత మవుతున్న రవితేజకు క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఫేమ్ లోకి వచ్చాడు.
ఈ ఆనందం లో రవితేజ వరస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే రవితేజ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా ప్రకటించాడు.
కొత్త దర్శకుడు శరత్ మండవ ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ సినిమాకు ”రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.ముందు నుండి ప్రమోషన్స్ పరంగా దూకుడుగా వ్యవహరిస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతూ వస్తున్న టీమ్ తాజాగా మరొక అనౌన్స్ మెంట్ చేయడంతో మరొకసారి రామారావు ఆన్ డ్యూటీ పేరు మారు మోగిపోతుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా భాగం కానున్నదని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
చాలా రోజుల తర్వాత వేణు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించ బోతున్నాడని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.అప్పట్లో మంచి మంచి సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోగా చాలా సంవత్సరాలు నటించాడు.తర్వాత తర్వాత ప్లాప్స్ రావడంతో చిన్నగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి చూడాలి సెకండ్ ఇన్నింగ్స్ తో తన కెరీర్ ఏ విధంగా మారుతుందో.