సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా బయట పడే వార్తలు ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ కేసు.ఎప్పటి నుంచో ఈ రెండు వ్యవహారాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి.
ఇక ముఖ్యంగా డ్రగ్స్ కేసు వ్యవహారం మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో బయట పడుతూనే ఉంది.ఎంతోమంది నటీనటుల, సినీ ప్రముఖుల పేర్లు డ్రగ్స్ వ్యవహారంతో బయటపడ్డాయి.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు మరికొన్ని సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ కేసు వ్యవహారం నడుస్తూనే ఉంది.ఇక ఇటీవలే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వ్యవహారంలో అనుమానంగా ఉన్నా పలువురు నటీనటుల, దర్శక నిర్మాతల పేర్లు బయట పడటంతో వారిపై ఈడీ అధికారులు గంటల కొద్దీ విచారణ చేశారు.
దీంతో ఈ విచారణ ముగియడంతో ఇక తమ పై ఎటువంటి అనుమానాలు లేవని అనుకున్నారు కొందరు సెలబ్రెటీలు.కానీ మళ్ళీ ఈ వ్యవహారం గురించి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు.
ఈసారి సెలబ్రెటీల అకౌంట్లపై ఈడీ అధికారులు నిఘా పడినట్లు తెలుస్తుంది.దీంతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో సెలబ్రేటీలకు టెన్షన్స్ మొదలైనట్లు తెలుస్తుంది.
గతంలో కొన్ని రోజుల వరకు నిశబ్దం గా ఉన్న ఈడీ అధికారులు ఇటీవలే మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసును తవ్వారు.దాంతో అందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరి ప్రముఖుల పేర్లు బయట పడ్డాయి.అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, ఛార్మి, నందు, రవితేజ వంటి పలువురు సెలబ్రేటీల పేర్లు బయటపడ్డాయి.
వీరితో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ కూడా జరిపారు.
ఓవైపు మనీలాండరింగ్ గురించి కూడా విచారణలు జరిగాయి.డ్రగ్స్ వ్యవహారంలో కీలక బాధ్యతలు ఉన్న వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని కూడా చర్చలు చేశారు ఈడీ అధికారులు.
అలా చాలావరకు తమ వ్యక్తిగత విషయాలన్ని తవ్వి గంటలకొద్దీ విచారణ చేశారు.
ఓ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాకుండా మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈడీ అధికారులు బాగా చర్చలు చేశారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రెటీల పేర్లు బయటపడ్డాయి.అలా ఈడీ అధికారులకు అనుమానం వచ్చినప్పుడల్లా విచారణలు చేపడుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈడీ అధికారులకు మరోసారి అనుమానాలు ఎదురవడంతో ఈసారి కొత్త కోణంలో విచారిస్తున్నారు.
తాజాగా వచ్చిన అనుమానంతో సెలబ్రెటీల ఖాతాలపై ఈడీ శాఖ బాగా దృష్టి పెట్టింది.అందులో తమ లావాదేవీలను పరిశీలించడమే కాకుండా వెంటనే వాటి గురించి ప్రశ్నలు కూడా వేస్తున్నారని తెలిసింది.ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ ప్రముఖులు, అకౌంటు హోల్డర్ లు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.
సినిమాల పేరుతో విదేశాల అకౌంట్లకు డబ్బులు పంపిస్తున్నట్లు అనుమానాలు రావడంతో మరోసారి గట్టిగా దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు.ముఖ్యంగా నటీనటుల, దర్శకనిర్మాతల అకౌంట్ లపై దృష్టి పెట్టినట్లు తెలిసింది.