‘బ్రహ్మోత్సవం’ సినిమాకి సంబంధించిన చివరిపాట చిత్రీకరణ, హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.ఈ నెల 6వ తేదీ సాయంత్రంతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తవుతుంది.7వ తేదీన ఆడియో వేడుకను జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.ఈ సినిమా కోసం 10 పాటలను రెడీ చేసినా, 8 పాటలను మాత్రమే వాడినట్టుగా తెలుస్తోంది.
ఈ పాటలన్నీ కూడా సంతోషాన్నీ .సంబరాన్ని కలిపి అందిస్తూ పసందుగా కొనసాగుతాయని చెబుతున్నారు.
దర్శకుడు శ్రీ కాంత్ అడ్డాల ఈ పాటలను నయన మనోహరంగా చిత్రీకరించాడని అంటున్నారు.ప్రేమ .సఖ్యత .బంధాలు .అనుబంధాల నేపథ్యంలో కొనసాగే ప్రతి పాట, ఒక పండుగను గుర్తుకు చేస్తుందని చెబుతున్నారు.ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.