ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది.ధర్మపురి, సేలం, ఈరోడ్, కృష్ణగిరి జిల్లాల్లో వర్షం కురుస్తుంది.
ధర్మపురి -బెంగళూరు హైవేపై భారీగా వరద నీరు చేరింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.కుమారపాలయం అనే గ్రామం పూర్తిగా నీట మునగగా.
కృష్ణగిరి జిల్లాలో ఇల్లు కూలి ఇద్దరు మృత్యువాత పడ్డారు.
వరద సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ ఆరా తీశారు.
లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో మెట్టూరు డ్యాం పరివాహక ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.