టొర్నాడో అంటే మన ఇండియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కాని అమెరికా లాంటి దేశాలలో ఈ టొర్నాడో ల ధాటికి గురైన వారు చాలా మంది ఉన్నారు.ఒక్కసారి టొర్నాడో వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉండే కార్లు, వస్తువులు, మనుషులని కూడా గాల్లోకి అమాంతం లేపెస్తుంది.
ఓ విధంగా చెప్పాలంటే మన ఇండియాలో వేసవి కాలంలో వేడి గాలుల కారణంగా కనిపించే సుడిగాలుల తీవ్రత భారీ స్థాయిలో ఉండే వాటినే టొర్నాడోలు అంటారు.
అలాంతో టొర్నాడో తాజాగా పెద్దపల్లిలో కనిపించి అందరిని భయభ్రాంతులకి గురి చేసింది.
సుడిగాలులు రావడం సాధారణంగా అందరూ చేసేదే అయిన.గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో సాయంత్రం ఎండ తీవ్రతతో వేడి గాలులు తీవ్రత ఎక్కువైంది.
అదే సమయంలో స్టేడియం నాలుగు వైపుల నుండి వేడి గాలులు రావడంతో సుడిగాలి తీవ్రత ఎక్కువై, టోర్నాడోగా మారి బీభత్సం సృష్టించింది.మైదానంలో దాదాపు 20 నిమిషాల పాటు వణికించింది.
దీంతో ఆ టొర్నాడో మరింత భీభత్సం సృష్టిస్తుంది అని అందరూ భావించిన కొద్ది సేపటికి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు.