మన దేశంలో ప్రధాన పంట ఏది అని అడిగితే టక్కున చెప్పే సమాధానం వరి.దక్షిణ భారతదేశంలో అయితే ఇది మరింత ముఖ్యమైన ఆహార వనరుగా వినియోగిస్తుంటారు.
ఎన్ని చపాతీలు, పూరీలు తిన్నా కూడా చివరకు గుప్పెడు అన్నం తినకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది.దక్షిణ భారతదేశంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు అన్నంని మూడు పూటల ఆహారంగా తీసుకుంటున్నారు.
అన్నానే ప్రధాన ఆహార వనరుగా తీసుకోవడంలో మన దేశంతో పాటు ఇంకా పది దేశాలు కూడా ఉన్నాయి.అవి ఏవి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
- చైనా.చైనా ఒక సంవత్సరానికి వినియోగించే బియ్యం.142, 930 మెట్రిక్ టన్నులు.
- భారతదేశం.
భారతదేశంలో ఒక సంవత్సరానికి గాను వినియోగించే బియ్యం 102, 500 మెట్రిక్ టన్నులు.
- ఇండోనేషియా.వినియోగించే బియ్యం.37, 700 మెట్రిక్ టన్నులు
- బంగ్లాదేశ్.వినియోగించే బియ్యం.35, 800 మెట్రిక్ టన్నులు.
- వియత్నం.వినియోగించే బియ్యం.21, 500 మెట్రిక్ టన్నులు.
- ఫిలిప్పీన్స్.వినియోగించే బియ్యం.14, 400 మెట్రిక్ టన్నులు.
- థాయిలాండ్.వినియోగించే బియ్యం 11, 700 మెట్రిక్ టన్నులు.
- బర్మా.వినియోగించే బియ్యం 10, 550 మెట్రిక్ టన్నులు.
- జపాన్ వినియోగించే బియ్యం 8,400 మెట్రిక్ టన్నులు.
- బ్రెజిల్.
బ్రెజిల్ వినియోగించే బియ్యం 7,500 మెట్రిక్ టన్నులు.
ప్రధాన ఆహారం అన్నంగా తీసుకునే దేశాలలో భారత దేశం రెండవ స్థానంలో ఉండడం గమనార్హం.
చూశారుగా.భారత దేశంలో ఎక్కువ శాతం మంది ఆహారంగా అన్నం ను తినేందుకే ఇష్టపడుతారు.అన్నం ఒక్క పూటా తినకపోయినా ఆరోజు తిన్నట్టు అనిపించదు మన భారతీయులకు.నిజానికి అన్నం తినే దేశాలలో మనది మొదటి స్థానంలో ఉండాలి.
కానీ చైనా మనకంటే పెద్ద దేశం కనుక అది అగ్రస్థానంలో నిలిచింది.మన భారతీయ జనాభాతో పోలిస్తే చైనా 2 వ స్థానంలో ఉండాలి.
ఇకపోతే భారతీయులు ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్లే మధుమేహం భారిన పడుతున్నారు.దీనికి కారణం రైస్ ఏ అవ్వడం గమనార్హం.మన దేశంలో ఎక్కువ పడినప్పటికీ వీలైనంత వరకు రైస్ తినడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు.మరి ఈ విషయంపై మీరు ఏం అంటారు ?
.