బాలీవుడ్ లో మన సౌత్ సినిమాల రీమేక్ మాత్రమే కాదు.సౌత్ డైరెక్టర్స్ పాన్ ఇండియా రిలీజ్ల హవా కూడా నడుస్తుంది.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి గేమ్ చేంజర్ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, ఆడియెన్స్ అంతా సౌత్ సినిమాల వైపు, సౌతం డైరెక్టర్ల వైపు చూస్తున్నారు.ఆల్రెడీ 2021, 22లో రిజలీకు రెడీ అయిన సినిమాలు, ప్రొడక్షన్ లో ఉన్న మరికొన్ని సినిమాలు భారీ రేంజిలో ఉన్నాయి.
ఈ స్పీడ్ చూస్తుంటే సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ లో జెండా పాతే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అనిపిస్తోంది.
రాజమౌళి- RRRబాహుబలి తర్వాత ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.
ఈ సినిమా విడుదల అయి హిట్ కొడితే వెయ్యి కోట్లు వసూలు చేయడం పక్కా అనేది ట్రేడ్ అనలిస్టుల అంచనా.
ప్రశాంత్ నీల్-కేజీఎఫ్ 2
ఈ సినిమా నార్త్, సౌత్ అని తేడా లేకుండా షేక్ చేసింది.తాజాగా కేజీఎఫ్2 పేరుతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది.
రాధాకృష్ణ- రాధే శ్యామ్
సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం సౌత్ కంటే నార్త్ జనాలే ఎక్కువ ఎదురు చేస్తున్నారు.షూటింగ్ ఎండిగ్ దశకు చేరింది.ఈ మూవీ బాలీవుడ్ లో కొత్త రికార్డులు సెట్ చేసే అవకాశం ఉంది.
గౌతమ్- జెర్సీ హిందీ రీమేక్
తెలుగులో మాస్టర్ పీస్ అనిపించిన జెర్సీని హిందీలో షాహిద్ తో రీమేక్ చేస్తున్నారు.
పూరీ-లైగర్
కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో పూరీ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్.విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఈ సినిమాలో కలసి నటిస్తున్నారు.
శైలేష్-హిట్
హిట్ మూవీతో హిట్ కొట్టిన శైలేష్.ఈ మూవీని బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావ్ తో చేస్తున్నాడు.ఈ సినిమా మినిమం 300 కోట్ల బిజినెస్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.
సందీప్ రెడ్డి- యానిమల్
అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో హిందీలో తీసిని.రికార్డు సృష్టించిన సందీప్ రెడ్డి ఈ సారి యానిమల్ అనే సినిమాను రణ్ బీర్ తో చేస్తున్నాడు.
నాగ్ అశ్విన్- ప్రభాస్ 21
వైజయంతి మూవీస్ బ్యానర్ లో 300 కోట్ల బడ్జెట్ తో నాగ అశ్విన్ దర్శకత్వంలె వస్తున్న ఈ మూవీకి.ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయ్యింది.