హీరో రామ్ ని డబ్బు కోసం బ్లాక్ మేయిల్ చేసిన బడా నిర్మాత

నిర్మాత బెల్లంకొండ ఈమధ్య వార్తల్లో పెద్దగా కనిపించడం లేదని అనుకుంటుండగా, ఓ సంచలనాత్మక విషయాన్ని మీడియాకి ఐటమ్ గా ఇచ్చేసారు ఈ నిర్మాత.అది కూడా ఒక క్రేజి హీరోని బ్లాక్ మేయిల్ చేసి.

 Top Producer Blackmailed Hero Ram For Money-TeluguStop.com

ఆ హీరో ఎవరో, ఆ సంగతి ఏంటో చూడండి

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో రామ్ కందిరీగ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ ని రుచి చూసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది‌.

అప్పట్లోనే దాదాపుగా 18-20 కోట్ల షేర్ వసూళ్ళు సాధించింది.దాంతో బెల్లంకొండ రామ్ తో మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయి, రామ్ కి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారట‌

కందిరీగ కాంబినేషన్ ని రిపీట్ చేసి, అదే సక్సెస్ ని సొంతం చేసుకోవాలని మళ్ళీ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే రామ్ తో సినిమా ప్లాన్ చేసారు బెల్లంకొండ.

కాని అర్థాంతరంగా ఆ ప్రాజెక్టు లోంచి రామ్ ని తప్పించి, ఎన్టీఆర్ ని తీసుకొచ్చారు.ఆ సినిమానే రభస.తీరా ఆ సినిమా విడుదలయ్యాక డిజాస్టర్ గా నిలిచింది అనుకోండి, అది వేరే విషయం

ఏళ్ళు గడిచిపోయాయి కాని, రామ్ బెల్లంకొండ కలిసి మళ్ళీ సినిమా తీయలేదు.ఆ కోటి రూపాయల అడ్వాన్స్ కూడా అలానే రామ్ దగ్గరే ఉండిపోయింది.

ఇప్పుడు సడెన్ గా, ఆ కోటి రూపాయలు కావాలని రామ్ ని డిమాండ్ చేసారట బెల్లంకొండ.అక్కడితో ఆగకుండా, కోటి రూపాయలు వెంటనే ఇవ్వకపోతే విడుదలకి సిద్ధంగా ఉన్న “ఉన్నది ఒకటే జిందగీ” విడుదల కాకుండా అడ్టుకుంటానని బ్లాక్ మేయిల్ చేసారట.

సినిమా రిలీజ్ టైమ్ లో గొడవలు ఎందుకని రామ్ ఆ కోటి రూపాయలు వెనక్కి ఇచ్చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube