సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.అయితే సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
హీరోహీరోయిన్లు సోషల్ మీడియాలో ఏవైనా కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఒక్కో పోస్టుకు ఇంత మొత్తం అని కంపెనీల నుంచి తీసుకుంటారు.అలా కోట్లు సంపాదిస్తున్న టాప్ 5 సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్న వారిలో ప్రియాంక చోప్రా ముందువరసలో ఉన్నారు.గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు కోటీ 80 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు.ప్రియాంక చోప్రా తరువాత స్థానంలో 94.6 మిలియన్ ఫాలోవర్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.ఒక్కో పోస్టుకు కోహ్లీ కోటీ 35 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
42 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అలియాభట్ కోటి రూపాయల చొప్పున ఒక్కో పోస్ట్ కు తీసుకుంటున్నారు.ఇన్స్టాగ్రామ్ లో 24.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక్కో పోస్ట్ కు 80 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అమితాబ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అమితాబ్ బచ్చన్ ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు ఒక్కో పోస్టుకు తీసుకుంటున్న మొత్తం ఆయా సెలబ్రిటీల అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలలో కొంతమంది సైతం ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
తాజా వార్తలు