హైదరాబాద్ ఉప్పల్ లో రేపు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది.ఈ మేరకు మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
మ్యాచ్ సందర్భంగా సుమారు 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.రేపు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు.
స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.ఆన్ లైన్ లో మ్యాచ్ టికెట్స్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు.
బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.అదేవిధంగా మ్యాచ్ మధ్యలో ఎవరూ స్టేడియంలోకి రావొద్దని సూచించారు.