ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో చెప్పనవసరం లేదు.ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా 7కి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు.
అంతేగాక మరి కొందరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం.అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు దేశంలోని పలు రంగాల పై పడింది.
ఇందులో ముఖ్యంగా సినిమా రంగంలో అయితే ఇప్పటికే పలు భారీ బడ్జెట్ చిత్రాలను కూడా వాయిదా వేస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం కేరళ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది.
అయినప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురవుతుండటంతో రేపటి నుంచి ఈ నెల 31వ తారీకు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సినిమా థియేటర్లను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.అంతేగాక ఈ నిర్ణనయానికి పలు సినిమా నిర్మాణ సంస్థలు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ కరోనా వైరస్ జనాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో వ్యాప్తి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.అంతేకాక ఇప్పటికే పలు రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రజలని ఎక్కువగా సంచరించ వద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే దాదాపుగా పలు రంగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియోని కూడా ప్రభుత్వ అధికారులు విడుదల చేశారు.ఈ వీడియోలో విజయ్ దేవరకొండ కరోనా వైరస్ సోకకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాడు.