జగన్‌ చేయబోతున్న ప్రకటనపై అందరి దృష్టి

రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.ఈ సమావేశాల్లో ఏపీ రాజధాని విషయంలో జగన్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

 Tomorrow Jagan Give The Clarity On Ap Capital Amaravathi-TeluguStop.com

గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.అందుకోసం ఒక కమిటీ వేయగా ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది.

ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కేబినెట్‌లో కూడా భేటీ అయ్యి చర్చించిన విషయం తెల్సిందే.ఇక రేపు ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి విషయమై స్పష్టత రాబోతున్న నేపథ్యంలో అంతా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలపై ఒక కన్నేసి ఉంచే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.మొత్తానికి మరికొన్ని గంటల్లో అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారికి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube