ముఖ్యమంత్రిని కలిసిన టాలీవుడ్ సినీ నిర్మాతలు... ఎందుకంటే...

రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినా లేదా ఇతర కారణాల వల్ల వ్యక్తులు మృతి చెందిన వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు.అందులో భాగంగా 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాఖపట్నం లో హుదూద్ తుఫాను ఎంత కలకలం సృష్టించిన విషయం అందరికీ బాగానే తెలుసు.

 Tolywood Producers Meet Ap Cm Jagan Mohan Reddy-TeluguStop.com

ఈ తుఫాను కారణంగా ఎంతోమంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.దీంతో అప్పట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాగానే స్పందించారు.

అంతేగాక ఇతర జిల్లాలలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా విరాళాల రూపంలో ఆర్థిక సాయం చేశారు.

అయితే వద్దు తుఫాను బాధితులకు సాయం చేయడం కోసం టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరు కలిసి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలుచేసి ఇ నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని మంచి ఉద్దేశంతో కొత్త ఇళ్లను విశాఖపట్నం పరిసర ప్రాంతంలో నిర్మించారు.

దీంతో ఈ ఇళ్లను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు టాలీవుడ్ నిర్మాతలు కలిసి సాదరంగా ఆహ్వానించారు.అంతేకాక గతంలో టాలీవుడ్ సినీ పరిశ్రమ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కృషి చేశారని ఆయన కృషి మరువలేనిదని అన్నారు.

Telugu Jaganmohan, Suresh Babu, Tollywood-Movie

ఈ విషయం తెలుసుకున్నటువంటి పలువురు ప్రజా సంఘాల నాయకులు  హార్శ్యం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే హీరోలు తమకు తోచినంత సహాయం చేసి తుఫాను కారణంగా నిరాశ్రుయులైన వారికి ఇళ్లను కట్టించి ఇవ్వడం చాల మంచి విషయమని పొగుడుతున్నారు.ఇలాగే కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలంటూ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube