రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినా లేదా ఇతర కారణాల వల్ల వ్యక్తులు మృతి చెందిన వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు.అందులో భాగంగా 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాఖపట్నం లో హుదూద్ తుఫాను ఎంత కలకలం సృష్టించిన విషయం అందరికీ బాగానే తెలుసు.
ఈ తుఫాను కారణంగా ఎంతోమంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.దీంతో అప్పట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాగానే స్పందించారు.
అంతేగాక ఇతర జిల్లాలలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా విరాళాల రూపంలో ఆర్థిక సాయం చేశారు.
అయితే వద్దు తుఫాను బాధితులకు సాయం చేయడం కోసం టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరు కలిసి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలుచేసి ఇ నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని మంచి ఉద్దేశంతో కొత్త ఇళ్లను విశాఖపట్నం పరిసర ప్రాంతంలో నిర్మించారు.
దీంతో ఈ ఇళ్లను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు టాలీవుడ్ నిర్మాతలు కలిసి సాదరంగా ఆహ్వానించారు.అంతేకాక గతంలో టాలీవుడ్ సినీ పరిశ్రమ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కృషి చేశారని ఆయన కృషి మరువలేనిదని అన్నారు.
ఈ విషయం తెలుసుకున్నటువంటి పలువురు ప్రజా సంఘాల నాయకులు హార్శ్యం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే హీరోలు తమకు తోచినంత సహాయం చేసి తుఫాను కారణంగా నిరాశ్రుయులైన వారికి ఇళ్లను కట్టించి ఇవ్వడం చాల మంచి విషయమని పొగుడుతున్నారు.ఇలాగే కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలంటూ కోరుతున్నారు.