తెలుగు సినిమా పరిశ్రమలో వారసులు పరిచయం కావడం ఇదేమీ కొత్త కాదు.ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలతో పాటు హీరోల కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
వారిలో పలువురు తమ టాలెంట్ ను నిరూపించుకుని హీరోలుగా రాణిస్తున్నారు.మరికొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
తాజాగా సంక్రాంతికి ఇద్దరు వారసులు హీరోలుగా జనాల ముందుకు వచ్చారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మనువడు గల్లా అశోక్ హీరో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
అటు దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ కూడా రౌడీ బాయ్స్ సినిమా ద్వారా హీరోగా ముందుకు వచ్చాడు.మొత్తంగా తమ తొలి సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు.
అయితే వీరు హీరోలుగా ప్రూవ్ చేసుకుంటారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.సినిమాల్లోకి రావడానికి మాత్రం బాగానే గ్రౌండ్ వర్క్ చేశారట.
కృష్ణ కుటుంబ నుంచి వస్తున్న మూడో జెనరేషన్ హీరో అశోక్.అటు కుటుంబ బ్యాగ్రౌండ్ ఒక్కటే కాదు.సినిమాల ఆసక్తితో హీరోగా రావాలి అనుకున్నాడు.తాత, మామ సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు.విదేశాల్లో ఫిల్మ్ కోర్సులు కూడా కంప్లీట్ చేశాడు.అటు శ్రీమంతుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
కొరటాల శివ ఈ విషయాన్ని వెల్లడించాడు.అటు దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ కూడా హీరోగా రావడం కోసం బాగానే కష్టపడ్డాడు.
లావుగా ఉండే ఆశీష్.హీరోగా మారడం కోసం దాదాపు 25 కేజీలు తగ్గాడు.అటు యాక్టింగ్ లో మెలకువల కోసం ముంబైతో పాటు అమెరికాలోనూ శిక్షణ తీసుకున్నాడు.అటు కేరితం అనే సినిమాకు అసిస్టెంట్ గా కూడా పని చేశాడు.మొత్తంగా సినిమా పరిశ్రమలోకి రావడానికి అవకాశం ఉన్నా.నటులుగా మంచి సత్తా చాటేందుకు ఈ ఇద్దరు యువ హీరోలు చాలా కష్టపడ్డారు.
అనుకున్నట్లుగానే హీరోగా మారారు.జనాల ముందుకు వచ్చారు.
అయితే ఎవరిని జనాలు ఎలా ఆదరిస్తారు? ఎవరు బాగా సినిమా పరిశ్రమలో రాణిస్తారు? అనేది మున్ముందు తెలియనుంది.