తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “సాయి పల్లవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
అంతేకాక గ్లామరస్ పాత్రలకి సాయి పల్లవి దూరంగా ఉన్నప్పటికీ ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తనకంటూ కొద్ది మంది అభిమానులని తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది.
అయితే తాజాగా సాయి పల్లవి కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇటీవలే షూటింగులకు అనుమతులు ఇవ్వడం తో సాయి పల్లవి మాస్కు ధరించి ఎయిర్ పోర్టు నుండి బయటకు వస్తున్న సమయంలో కొందరు నెటిజన్లలో ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.
దీంతో సాయి పల్లవి అభిమానులు ఆమె ఫోటోలని నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నటువంటి లవ్ స్టోరీ అనే చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో కొంతకాలం పాటు ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.కాగా తెలుగులో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న “విరాటపర్వం” అనే చిత్రంలో కూడా సాయి పల్లవి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.