ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ మధ్య కాలంలో కొంతమేర కరోనా ఉద్ధృతి తగ్గు ముఖం పట్టడంతో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు చేపడుతూ షాపింగ్ మాల్స్, బార్ బార్ మరియు రెస్టారెంట్లు మార్కెట్లు, ఇలా ఒక్కొక్కటి తెరుస్తున్నారు.
దీంతో ఇక క సినిమా థియేటర్ల వంతు వచ్చింది.అయితే కొన్నిచోట్ల సినిమా థియేటర్లను ఓపెన్ చేసినప్పటికీ ప్రజలు మాత్రం థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.
దీంతో ప్రజలను సినిమాలు చూసేందుకు ప్రజలు సినిమా థియేటర్లకి రావాలంటూ కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన స్టార్ హీరోలు కలిసి ఓ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ని కన్నడ ప్రముఖ స్టూడియో సంస్థ అయినటువంటి కె.
ఆర్.జి స్టూడియోస్ సంస్థ రూపొందించింది.దీంతో ఈ వీడియోని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.ఈ వీడియో చూసినటువంటి ఓ నెటిజన్ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా థియేటర్లను తెరవడం మంచిది కాదని అంటూ కామెంట్ చేశాడు.
దీంతో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ నెటిజన్ చేసినటువంటి కామెంట్ పై స్పందిస్తూ ఫ్లై ఓవర్లు, షాపింగ్ మాల్స్, అలాగే బార్లు మరియు రెస్టారెంట్లలలో లేని కరోనా కేవలం కామన్ మాన్ సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం వల్లే వస్తుందా.? అంటూ సమాధానమిచ్చాడు.అంతేకాక భద్రత అందరికీ ముఖ్యమేనని కాబట్టి దానికి కావాల్సిన ప్రామాణికాలను పాటిస్తే సరిపోతుందని కూడా చెప్పుకొచ్ఛాడు.
దీంతో కొందరు నెటిజన్లు సందీప్ కిషన్ చేసినటువంటి ఈ కామెంట్ పై స్పందిస్తూ సందీప్ కిషన్ చెప్పింది అక్షరాల నిజమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం ఓటిటి ప్లాట్ఫారంలో సినిమాలు చూడడం వల్ల ప్రజలకి కూల్ డ్రింక్స్ మరియు పాప్ కార్న్, ఇతర ఖర్చులు తగ్గిపోతాయని కాబట్టి అదే బెటర్ అని అంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగులో నూతన దర్శకుడు జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న “ఏ-వన్ ఎక్స్ ప్రెస్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో సందీప్ కిషన్ కి జంటగా అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాటి నటిస్తోంది.