తెలుగు బుల్లితెరలో బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రస్తుతం కమెడియన్ గా రాణిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు.
అయితే తాజాగా సుడిగాలి సుదీర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే ఈ కార్యక్రమంలో బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ తో కలిసి పాల్గొన్నాడు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యాత ఆలీ ఇద్దరితో సరదా సరదాగా మాట్లాడుతూ అందరిని కడుపుబ్బ నవ్వించాడు.
ఇందులో భాగంగా వ్యాఖ్యాత ఆలీ లాక్ డౌన్ సమయంలో ఏం చేశావంటూ సుడిగాలి సుధీర్ ని ప్రశ్నించాడు.దీంతో సుడిగాలి సుదీర్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఫిట్నెస్ సాధించడం కోసం వర్కౌట్లు బాగా చేశానని చెప్పుకొచ్చాడు.
ఈ విషయంపై ఆలీ స్పందిస్తూ నిన్ను చూస్తే అలా కనిపించడం లేదంటూ సుడిగాలి సుధీర్ పై పంచ్ విసిరాడు.దీంతో పక్కనే ఉన్నటువంటి రష్మి గౌతమ్ కూడా ఒకటిన్నర లక్ష బొక్క అంటూ సెటైర్లు వేస్తూ నవ్వింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుడిగాలి సుధీర్ యంగ్ దర్శకుడు అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహిస్తున్న కాలింగ్ సహస్త్ర అనే చిత్రం నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లోక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెలుగు బుల్లితెరలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కమెడియన్ గా నటిస్తున్నాడు.