టాలీవుడ్లో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యంగ్ హీరో శర్వానంద్.అయితే ఇటీవల కాలంలో శర్వానంద్ నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి అయినప్పటికీ శర్వానంద్ అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడూ అందుబాటులో ఉంటున్నాడు.
ఇప్పటివరకు శర్వానంద్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు.అయితే ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్ లో ఖాతాని తెరిచాడు.ఇందులో భాగంగా @iamsharwanand అనే పేరుతో ఓపెన్ చేసాడు.అయితే ఇటీవలే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా ట్విట్టర్లో ఖాతాను తెరిచారు.
ఈ ట్విట్టర్ ద్వారా మరింత సులభంగా అభిమానులతో సంభాషించవచ్చని శర్వానంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినిమా నిర్మాత రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహనన్ నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిచిన చిత్రీకరణ మొత్తం పూర్తీ కావడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు కిషోర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మరింత కలం పాటు ఈ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.