టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించగా, కేజిఎఫ్ ఫేమ్ అనంత నాగ్, టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, రఘు బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాగానే ఆకట్టుకుంటోంది.
అంతేకాక థియేటర్లలో మంచి వసూళ్లను కొల్లగొడుతూ నితిన్ కెరియర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నితిన్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నటువంటి “రంగ్ దే” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో అజ్ఞాతవాసి చిత్రంలో సూర్యకాంతం పాత్రలో మెప్పించిన కీర్తి సురేష్ నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో నితిన్ ప్రేమ కోసం జైలుకి వెళ్లినటువంటి ఖైదీ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
అంతేగాక నితిన్ పాత్ర కు సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి జూన్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
భీష్మ చిత్రం తో మంచి హిట్ అందుకున్న నితిన్ రంగ్ దే చిత్రంతో కూడా హిట్ కొట్టి తన విజయపరంపరను కొనసాగించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అయితే ఈరోజు ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న టువంటి హిందీ రీమేక్ చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులపై పెద్దల సమక్షంలో ఈ రోజున ప్రారంభించారు.అయితే ఈ చిత్ర షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.