సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది తాము ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమని చెబుతూ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఎంతోమందిని మోసం చేస్తూ ఉంటారు.డైరెక్టర్ ల దగ్గర హీరోల దగ్గర అవకాశాలు ఇప్పిస్తాము అంటూ అమాయకమైన వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగి వారిని మోసం చేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది అలాంటి మోసగాళ్ల చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే.అమాయకులను టార్గెట్ గా చేసుకుని సినిమా ఆఫీసులు తెరిచి మోసాలకు పాల్పడుతుంటారు.
సినిమా తీస్తున్నామని చెప్పి డబ్బు, సమయం రెండూ వృధా చేస్తుంటారు.
అలాంటి వాళ్లలో సినీ నటుడు నవీన్ రెడ్డి ఒకరు.
సినిమా పేరుతో కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన నవీన్ రెడ్డిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడెం గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి సినిమా పేరుతో మోసానికి పాల్పడ్డాడు.
ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.నవీన్ రెడ్డి కంపెనీలోని మిగతా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా సంతకాలు ఫోర్జరీ చేసి దాదాపుగా రూ.55 కోట్లు విలువ చేసే కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు బాధితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.నవీన్ రెడ్డిపై 420, 465, 468, 471 ఆర్ డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
విచారణ అనంతరం నవీన్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ కు తరలించారు.
ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేశాడని నో బడీ అనే పేరుతో సినిమా కూడా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు.ఇక గతంలో నవీన్ రెడ్డిపై పలు బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు.అలా డైరెక్టర్ల సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడుతున్న నవీన్ రెడ్డిని మొత్తానికి పోలీసులు అరెస్టు చేశారు.