తెలుగులో 2013వ సంవత్సరంలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ “కిస్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి అడవి శేష్ తానె దర్శకత్వం వహించాడు.
కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు భరత్, ప్రియా బెనర్జీ మరియు ఇతరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్ర ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు కొంతమేర శ్రద్ధ వహించక పోవడంతో చిత్రం కథాంశం బాగున్నప్పటికీ వసూళ్లు మాత్రం సాధించలేక పోయింది.
అంతేకాక కొన్నిచోట్ల విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు తెలియలేదు.కాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను హీరో అడవి శేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తాను “పంజా” చిత్రంలో హీరోగా నటించిన తర్వాత తానే దర్శకుడిగా మారి కిస్ చిత్రాన్ని తెరకెక్కించానని కానీ ఆ చిత్రం తన సినిమా జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేసిందని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఈ చిత్రాన్ని కొన్నటువంటి కొందరు డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను చవి చూడడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారని, కానీ అప్పటికే తాను డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉండటంతో కొందరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై ఫిర్యాదు చేశారని కూడా తెలిపాడు.
దాంతో పోలీసులు తనని పోలీస్ స్టేషన్ కి పిలిపించి డబ్బులు ఇస్తావా.? లేదా.? అంటూ కొంతమేర బెదిరించారని కూడా తెలిపాడు. దాంతో ఆ రోజే సినిమా పరిశ్రమలో నటనా ప్రతిభను నిరూపించుకునే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నానని అందుకోసమే రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశానని తెలిపాడు.
అంతేగాక తాను తన చదువులు అమెరికాలో పూర్తి చేసినప్పటికీ ఇక్కడికి వచ్చిన తరువాత కనీసం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులే తాను ఈరోజు ఇలా ఉండడానికి కారణమని కూడా తెలిపాడు.అయితే ఇదంతా ఒకప్పటి మాట.
ప్రస్తుత కాలంలో అడవి శేష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.కథల పరంగా సరైన నిర్ణయం తీసుకుంటూ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం అడివి శేష్ తెలుగులో “మేజర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం 26/11 దాడులలో తన ప్రాణాలను అడ్డు పెట్టి ఎంతో మంది ప్రజలను కాపాడిన ఇండియన్ ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారం గా తెరకెక్కుతోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు దర్శకుడు శశి కుమార్ తిక్క సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.