టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది.ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ లు కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా పై టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలుగులో ఈ సినిమా బాగుంది.
పేరుకు మలయాళ రీమిక్స్ సినిమా అయినప్పటికీ తెలుగు రాజకీయాన్ని ఈ సినిమాలో పరిచయం చేశారు.అయితే మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను ఈ విషయాన్ని చెబుతున్నాను.
ఇందులో కథ చాలా స్లో ప్లేస్ లో వెళ్ళింది.చిరంజీవికి స్లో కథనం అనేది సరిపోదు.
ఈ సినిమాలో ఇంకా మార్పులు చేయాల్సింది.స్లో ప్లేస్ తో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగిన క్యారెక్టర్ కాదు.
సినిమా విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.కానీ చిరంజీవి డాన్స్ పాట లేని సినిమా కాస్త ఇబ్బందిగా అనిపించింది.
అలాగే ఈ సినిమాలో షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.అలాగే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఒకరకంగా ప్లేస్ మరొకరకంగా మైనస్ అని చెప్పవచ్చు.ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం ఫాన్స్ కు బాధ కలిగించింది.ఆచార్య సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ని లేదంటే పవన్ కళ్యాణ్ ని తీసుకొని ఉంటే ఈ సినిమా మరొక రేంజ్ లో ఉండేది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.