తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” అనే చిత్రంలో విలన్ భిక్షు యాదవ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ నటుడు “ప్రదీప్ రావత్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రదీప్ రావత్ మొదటగా తెలుగు చిత్రంతోనే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పటికీ క్రమక్రమంగా తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్, భోజ్ పూరి, తదితర భాషలలో నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్నాడు.
ఇక ప్రదీప్ రావత్ వైవాహిక జీవితానికి వస్తే ఇతడు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మోడల్ గా పని చేసినటువంటి కళ్యాణి రావత్ అనే మోడల్ ని పెళ్లి చేసుకున్నాడు.ఐతే ఈమె గతంలో పలు సంస్థల వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది.
అయితే ఈమె ప్రస్తుతం పలు హిందీ ధారావాహికలలో నటిస్తోంది.కాగా వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు.
దీంతో ఇద్దరూ నటీనటులు కావడంతో ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రదీప్ రావత్ విలన్ గా నటించిన సై, భద్ర, అందరివాడు, గజిని, తదితర చిత్రాలు ఇతడికి సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టాయి.
అయితే ప్రదీప్ రావత్ సినిమాల్లోకి రాక ముందు కొంతకాలం పాటు దూరదర్శన్ ఛానల్ లో కూడా పని చేసాడు.
అదే సమయంలో తెలిసిన వారి ద్వారా అప్పట్లో ప్రసారమయ్యే “మహాభారతం” ధారావాహికలో అశ్వద్ధామ పాత్రలో నటించాడు.
ఆ తర్వాత తెలుగులో హీరో నితిన్ నటించిన సై చిత్రంలో విలన్ గా నటించే అవకాశం దక్కించుకుని నిరూపించుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ విలన్ గా దూసుకుపోతున్నాడు.