తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “పెళ్లి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ హీరోయిన్ మహేశ్వరి” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మహేశ్వరి తెలుగులో మొదటగా 1994వ సంవత్సరంలో అమ్మాయి కాపురం అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించి సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెళ్లి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే చిన్నప్పటినుంచి మహేశ్వరికి సినిమాలపై మక్కువ ఎక్కువ ఉండడంతో ఆమె కాలేజీలో చదివే సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొంత కాలం పని చేసింది. ఆ తరువాత తెలిసిన వారి ద్వారా తమిళ్ భాషలో “కార్తుతమ్మ” అనే చిత్రంలో నటించింది.
అయితే 2008వ సంవత్సరంలో జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పెళ్లి అనంతరం మహేశ్వరి పూర్తిగా సినిమాల్లో నటించడం మానేసింది.
కానీ అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే “మై నేమ్ ఐస్ మంగ తాయారు” అనే ధారావాహికలో సంవత్సరం పాటు నటించింది.అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది.
అయితే ఏమైందో ఏమో గాని 2014వ సంవత్సరం తర్వాత మహేశ్వరి పూర్తిగా బుల్లితెరపై కూడా కనిపించడం మానేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో మహేశ్వరి నటించినటువంటి గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంతేగాక తెలుగులో ఈ అమ్మడు రవి తేజతో కలిసి జంటగా నటించిన నీ కోసం చిత్రానికి నంది అవార్డును కూడా గెలుచుకుంది.
తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరి కి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.అయితే నటి మహేశ్వరి స్వర్గీయ నటి మరియు అందాల తార శ్రీదేవి కి బంధువు కూడా అవుతుంది.