తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోలకి జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి భానుప్రియ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో ప్రముఖ సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన సితార చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.
తాజాగా నటి భానుప్రియ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన పలు అససక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 150కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించానని తెలిపింది.
కాగా అప్పట్లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ దర్శకుడు తనని పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రులను సంప్రదించాడని కానీ అప్పటికే ఆ దర్శకుడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని దాంతో తన తల్లి ఆ పెళ్ళికి అంగీకరించలేదని తెలిపింది.ఈ పెళ్లి ప్రపోజల్ కి ముందు ఆ దర్శకుడితో పలు చిత్రాల్లో కలిసి పనిచేశానని కూడా చెప్పుకొచ్చింది.
అయితే అప్పటి తరంలో హీరోయిన్ గా బాగానే రాణించిన భానుప్రియ ఇప్పుడు కూడా పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో అమ్మ, అక్క, చెల్లి తదితర పాత్రల్లో నటిస్తూ బాగానే అలరిస్తోంది.తెలుగులో చివరిగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన “మహానటి” చిత్రంలో దుర్గమాంబా అనే పాత్రలో నటించింది.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు భానుప్రియ తెలుగులో నటించలేదు.అయితే భాను ప్రియ తెలుగు బుల్లితెర మీద కూడా నాతి చరామి అనే సీరియల్ లో నటించి ఇటు బుల్లి తెర ప్రేక్షకులని కూడా బాగానే ఆకట్టుకుంది.
.