టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ప్రారంభం అయినా.కొన్ని కారణాలతో ఇంకా వాటి షూటింగ్ పూర్తి కావడం లేదు.
రిలీజ్ డేట్లు ప్రకటించినా.సినిమాలకు ప్యాకప్ చెప్పడం లేదు దర్శకుడు.
ఫైనల్ షూటింగ్ కోసం ఆయా హీరోలు ఇంకా ఎదురు చూస్తున్నారు.ఇంతకీ ఎప్పుడో మొదలై ఇంకా గుమ్మడికాయ కొట్టని సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్.ఈ సినిమా ఫైనల్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా కాలేదు.ఇప్పుడు ఇంకా నెమ్మదిగా షూటింగ్ కొనసాగుతుందట.ప్రస్తుతం పవన్ కల్యాణ్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడట.జనవరి 25న మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతాడట.ఆ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి.
శివరాత్రి బరిలో ఈ సినిమాలను నిలుపుతాడట.
అటు మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ సర్కారు వారి పాట.
ఈ సినిమా కూడా ఇంకా ఫైనల్ షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు.పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ 25 రోజుల పాటు కొనసాగనుందట.
కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో పలు సీన్లు రీ షూట్ చేస్తున్నారనే టాక్ వచ్చింది.అయితే అదంతా అవవాస్తవం అయిన సినిమా యూనిట్ ప్రకటించింది.
ఏప్రిల్ 1లోపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని వెల్లడించింది.
వరుస సినిమాలో బిజీగా ఉన్న రవితేజ కూడా పలు సినిమాలకు సంబంధించిన ఫైనల్ షూటింగ్ లు పూర్తి చేయాల్సి ఉంది.మార్చి 25న x సినిమా రిలీజ్ కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ షూట్ జరుగుతోంది.
అటు ఎఫ్ 3 సినిమా కూడా ఫైనల్ షూటింగ్ కొనసాగిస్తుంది.ప్రస్తుతం కరోనా మళ్లీ పెరుగుతున్న సమయంలో ఈ సినిమా షూటింగ్లు కంప్లీట్ అవుతాయా? లేదంటే మళ్లీ వాయిదా పడతాయా? అనే విషయం త్వరలో తేలే అవకాశం ఉంది.