చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.కొందరు అనారోగ్యంతో మరణిస్తే, మరి కొందరు కోవిడ్ వల్ల, ఇంకా కొందరు తమకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల బలవణ్మరణానికి పాల్పడుతున్నారు.
ఇలా సినిమా పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటున్న మరణాలు చిత్ర పరిశ్రమతో పాటుగా అభిమానులను కూడా విచారంలో మునిగేలా చేస్తున్నాయి.
ఇకపోతే తాజాగా టాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది.
గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత సి.శ్రీధర్ మృతిచెందారు.కాగా శ్రీధర్ నిర్మాతగా శోభన్ బాబు, జయసుధ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన “సోగ్గాడి కాపురం”.సుమన్, సౌందర్య జంటగా నటించిన “బాలరాజు బంగారు పెళ్లాం” వంటి సినిమాలను నిర్మించారు.
ఇక ఈయన స్వస్థలం నెల్లూరు కాగా, సినీ పరిశ్రమపై మక్కువతో చెన్నై వెళ్లిన శ్రీధర్ మంచి సినిమాలను నిర్మించారు.కాగా శ్రీధర్ ఆత్మకు శాంతి కలగాలని తెలుగు చిత్రసీమ ప్రముఖులు, నిర్మాతల మండలి వారి కుటుంబీకులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.