టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనగానే ఠక్కున వినిపించే పేర్లలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేటును కలిగి ఉన్న నిర్మాత దిల్ రాజు నేడు తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
ఈ సందర్బంగా ఆయన ఒక భారీ వేడుకను నిర్వహించాడు.పెళ్లి సందర్బంగా ఆయన టాలీవుడ్ వారిని ఎవరిని పిలువలేక పోయాడు.
ఆ కారణంగానే దిల్ రాజు తన 50వ పుట్టిన రోజు ను హాఫ్ సెంచరీ కంప్లీట్ పార్టీ పేరుతో టాలీవుడ్ ప్రముఖులందరిని పిలిచి పార్టీ ఇచ్చాడు.ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బయటి భాష ప్రముఖులు కూడా రావడం జరిగింది.
సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా డీఆర్50 వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రెబల్ స్టార్ ప్రభాస్, రాకీ స్టార్ యశ్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని స్టార్స్ నాగచైతన్య సమంత లతో పాటు దర్శకులు నిర్మాతలు హీరోయిన్స్ ఎంతో మంది వచ్చారు.ఒక వివాహ రిసెప్షన్ మాదిరిగా కూడా ఇది జరిగింది.
దిల్ రాజు లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.
రెండవ పెళ్లిన తన సొంత ప్రాంతంలో చేసుకోవడం వల్ల ఎవరిని పిలువలేక పోయాడు.ఇండస్ట్రీ వారికి ఒక పార్టీ ఇవ్వాలని భావించినా కూడా వీలు పడలేదు.ఇప్పుడు బర్త్ డే పేరుతో అది కూడా 50 వ బర్త్ డే అవ్వడంతో భారీ ఈవెంట్ ను దిల్ రాజు చేశాడు.
భారీ ఎత్తున సినీ ప్రముఖులు హాజరు అయిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా మామూలుగా లేదు.ఈ కార్యక్రమంలో దిల్ రాజు భార్య తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.