ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుగు సినిమా … ఒకప్పుడు 100 రోజుల గురించి మాట్లాడుకునేవాళ్ళం.ఇప్పుడు 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం.
కొట్లలో లాభాలు వచ్చినప్ప్పుడు … హీరోల రెట్లు కుడా కొట్లలో ఉండాలి కదా !
ఇప్పుడు మహేష్, పవన్ నుంచి మొదలుపెట్టుకొని, రవితేజ దాక .అంతా 10 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు.మహేష్,పవన్ ఏకంగా 20 కోట్ల క్లబ్ లో చేరారు.
మహేష్ బాబుకి దక్షిణ భారత దేశంలోనే అత్యధిక సంపాదన పొందే నటుడిగా పేరు ఉంది.దీనికి కారణం రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకోవం, ఇంకా అసలు ఎవరికీ అందనంత దూరంలో తన బ్రాండ్ వాల్యు ఉండటం.ఒక్కో కార్పోరేట్ కంపెని కోట్లకు కోట్లు వెచ్చింది మహేష్ చేత ప్రచారం చేయించుకుంటున్నాయి.
మహేష్ కి పోటిగా మరో హీరో సై అంటే సై అంటున్నాడు.పవన్ అంటే లెక్క లేదు అంటున్నాడు.
మార్కెట్లోకి కొత్త హీరో వచ్చాడు.మహేష్, పవన్ కన్నా ఎక్కువ డబ్బులు ఆ హీరో డిమాండ్ చేస్తున్నాడట .ఇంతకీ ఎవరా హీరో ? ఇంకెవరు మన బాహుబలి ప్రభాస్ .ఒక్క సినిమా ప్రభాస్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది.బాహుబలి రెండో భాగానికి రికార్డ్ మొత్తంలో ప్రభాస్ కి పారితోషికం ముట్టనుందట.ఎంత అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.