సినిమాలపై ఉన్న మోజుతో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ లో నటించాలని కొనసాగాలని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వారు ఎందరో.ఇలా వచ్చిన వారిలో జూనియర్ ఆర్టిస్ట్ గా కొందరు మరికొందరు వివిధ క్యారెక్టర్స్ లో నిలబడగా మరికొందరు అవకాశం దొరక్క వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు.
అయితే డైరెక్టర్ కావాలని ఆశిస్తూ వచ్చిన అనేకమంది మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత ఎంతో నేర్పరితనం సంపాదించుకుని ఆపై డైరెక్టర్ గా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.అందులో కొందరు గురువుకు మించిన శిష్యుడుగా కూడా చేరిపోయారు.
ఇక ఈ లిస్ట్ లో ఏ డైరెక్టర్లు ఉన్నారో చూద్దామా.
ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్.
ఈయన రాంగోపాల్ వర్మ శిష్యుడు.పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మారి ఆ తర్వాత రవితేజతో కలిసి వరుస హిట్లు సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు.
ఇక వర్మ శిష్యుడు అయిన హరీష్ శంకర్ కూడా రవితేజ నటించిన మిరపకాయ్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు.పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్నాడు.
వీరితో పాటు కృష్ణవంశీ కూడా రామ్ గోపాల్ వర్మ శిష్యుడే.ఈయన కూడా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తీస్తూ గులాబీ సినిమాతో టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత డైరెక్టర్ తేజ కూడా రాంగోపాల్ వర్మ అసిస్టెంట్.ఈయన కూడా చిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మారాడు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ గా సుకుమార్ పేరు గాంచాడు.ఈయన వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.సుకుమార్ మొట్టమొదటిసారిగా బన్నీతో కలిసి ఆర్య సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా పేరు పొందాడు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు జక్కన్న పేరు పొందిన వ్యక్తిగా రాజమౌళి సుప్రసిద్ధుడు.
ఈయన గురువు కే.రాఘవేంద్ర రావు.ఆయనతో కలిసి అనేక సీరియల్స్ కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నకు వచ్చే సమాధానం నాగ్ అశ్విన్.
అశ్విన్ మహానటి చిత్రంతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.నాగ్ అశ్విన్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వాడే.
అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్ లో దర్శకుడిగా మారిపోయాడు.