మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ అను ఇమాన్యూయేల్.ఈ భామ టాలీవుడ్ లో ఎంత వేగంగా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం సొంతం చేసుకుందో అంతే వేగంగా అవకాశాలకి దూరం అయ్యింది.
గ్లామర్ పరంగా ఎలాంటి అడ్డు చెప్పకపోయినా, నటిగా కూడా ఒకే అనిపించుకున్న ఈ అమ్మడుకి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు.పవన్ కళ్యాణ్, బన్నీ లాంటి హీరోల పక్కన నటించిన అనుకి అదృష్టం కలిసిరాలేదు.
దీనికి కారణం ఆమె చేసిన పాత్రలకి ఆయా సినిమాలలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడమే కారణం అని చెప్పాలి. కెరియర్ ఆరంభంలో వరుసగా వస్తున్న అవకాశాలతో ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఈ అమ్మడు కొంప ముంచింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం
నేను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఏ కథను ఎన్నుకోవాలో నాకు బొత్తిగా అవగాహన లేక పోయింది.ఆ సమయంలో ఏ సినిమా అవకాశం వస్తే ఆ సినిమాకి ఓకే చెప్పేశాను.
ప్రతి సినిమా డైరెక్టర్ మా వద్దకు వచ్చినప్పుడు కేవలం నా పాత్ర గురించి మాత్రమే చెప్పేవాడు.దాంతో నాకు చేస్తున్న సినిమా గురించి కనీసం అవగాహనా లేకుండా పోయింది.
ఈ కారణంగా స్టార్ హీరోలతో చేసిన నా పాత్రలు కథలో భాగంగా లేకుండా ఉండేవి.అందుకే ఆ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా మిగిలి పోయాయి.
కానీ నేను చేస్తున్న పెద్ద తప్పుల గురించి ఇప్పటికి అవగాహన వచ్చింది.ఇక నుంచి సినిమా పూర్తి స్క్రిప్టుని విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నా అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగులో ఒకే సినిమా ఉంది.మరి ఈ సినిమాతో తన ఇమేజ్ ని అను మార్చుకుంటుందేమో చూడాలి.