కరోనా వైరస్ ప్రారంభం నుండి ఇప్పటివరకు సినిమా థియేటర్లు కొన్ని రోజులు నడిపించడం, బంద్ చేయడం.వంటివే జరుగుతున్నాయి.
ఇక ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మొత్తంకు పెద్ద సమస్యగా మారింది.అసలు థియేటర్ల పై నమ్మకం అనేది పోగొట్టుకున్నారు.
అంతేకాకుండా కోవిడ్ పరిస్థితుల వల్ల ప్రజలు కూడా థియేటర్ కి వెళ్లడానికి భయపడటంతో.చాలా మంది నిర్మాతలు ఓటీటీ వేదికపై దారి మలిపారు.
అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్ల పై ఆశలు వదులుకొని ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇక మహేష్ బాబు మాత్రం ఓటీటీ గురించి మరోలా స్పందించాడు.
ప్రస్తుతం మహేష్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు.అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమా ఒప్పుకున్నాడు.
ఇక మరో నిర్మాణ సంస్థలో కూడా ఓ సినిమాకు సైన్ చేశాడన్నట్లు తెలుస్తుంది.ఇవన్నీ స్టార్ డైరెక్టర్ ల దర్శకత్వంలో తెరకెక్కనుండగా.
ఈ సినిమాలన్నీ ఎందులో విడుదలవుతాయని మహేష్ అభిమానులు ప్రశ్నార్థకంగా ఉన్నారు.
దీంతో తాజాగా మహేష్ బాబు ఈ విషయం గురించి స్పందించి తను మాట్లాడిన దాన్ని బట్టి ఈ సినిమాలన్నీ థియేటర్లోనే విడుదలవుతాయని ఓ క్లారిటీ వచ్చింది.తాను నటిస్తున్న సినిమాలన్నీ థియేటర్లోనే విడుదల చేయడానికి రూపొందిస్తున్నామని తెలిపాడు.
ముఖ్యంగా థియేటర్ల నుండి తన అభిమానులను, ప్రేక్షకులను పేరు చేయను తెలిపాడు.ఇక ఓటీటీ వేదికకు మాత్రం గౌరవం ఇస్తాను అంటూ.ఇది ఒక ప్రత్యేక సంస్థ అని చెప్పాడు.
దీంతో మహేష్ చెప్పిన మాటలకు మహేష్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి సినిమాలన్నీ థియేటర్లోనే విడుదల చేస్తానని తెలిపాడు.