తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ప్రియాంక రెడ్డి హత్య ఉదంతంను పోలీసులు 24 గంటలు కూడా గడవకుండానే ఛేదించారు.నలుగురు నింధితులను అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం కేసును ఎంక్వౌరీ పూర్తి చేశారు.
ప్రియాంక రెడ్డి మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఈ సమయంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమా అంటూ హీరోయిన్స్ ప్రశ్నిస్తున్నారు.పలువురు స్టార్స్ ప్రియాంక రెడ్డి మరణంపై మరణించడంతో ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రియాంక రెడ్డికి సంబంధించిన వార్తలే గుప్పుమన్నాయి.ఒక విషయమై ఈమద్య కాలంలో ఇంతగా సెలబ్రెటీలు స్పందించడం ఇదే ప్రథమం.
ఆ మద్య నిర్భయ సంఘటన గురించి మాట్లాడారు, మళ్లీ ఇప్పుడు ప్రియాంక రెడ్డి విషయం గురించి అంతా మాట్లాడారు.