ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియన్ సినిమాల పరిధి పూర్తిగా విస్తరించింది.భాషా పరిమితులు చాలా వరకు చెరిగిపోయాయి.
స్టార్ హీరోలు సినిమాలు అయితే పూర్తిగా భాషలతో సంబధం లేకుండా సౌత్ భాషలన్నింటిలో రిలీజ్ అవ్వుతున్నాయి.అలాగే సక్సెస్ అందుకుంటున్నాయి.
ఇక కంటెంట్ ఉంటే సినిమా ఏ భాషలో అయినా కనెక్ట్ అవుతుందని, తమిళ, మలయాళీ సినిమాలు ఎక్కువగా ప్రూవ్ చేసుకుంటున్నాయి.ఈ సినిమాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.
గతంలో కన్నడ భాషలోకి ఇతర బాషా సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు.అయితే అక్కడ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సౌత్ లో ఇతర భాషా సినిమాలని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
సౌత్ సినిమాల పరిధులు పూర్తిగా చెరిగిపోవడంతో ఇతర భాషలలో సక్సెస్ అయిన దర్శకులకి తెలుగులో డిమాండ్ ఏర్పడుతుంది.
తెలుగు అగ్ర హీరోలు ఆయా దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తమిళంలో సక్సెస్ అయిన మురుగదాస్, అట్లీతో తెలుగు హీరోలు సినిమాలు చేయడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే ఇప్పుడు తెలుగులో ఇద్దరు దర్శకుల పేర్లు భాగా వినిపిస్తున్నాయి.
వాళ్ళు కేజీఎఫ్ తో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయిన ప్రశాంత్ నీల్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్ నడుస్తుంది.ఇక తమిళంలో ఖైదీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన లోకేష్ కనగరాజ్ పై కూడా టాలీవుడ్ స్టార్స్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇప్పటికే ఈ దర్శకుడుతో రామ్ చరణ్ అల్లు అర్జున్ తో పాటు కొంత మంది స్టార్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.అయితే వీరిలో ఎవరి తో ముందుగా తెలుగు సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
.