ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న అటువంటి కలకలాన్ని ఆపడానికి దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ కారణంగా ఎక్కడి జన సాంద్రత అక్కడే స్తంభించిపోయింది.దీంతో చిరు వ్యాపారస్తులు రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అందువల్ల వీరికి సహాయ సహకారాలు అందించేందుకు కోసం సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.ఇందులో భాగంగా తమకు తోచినంత నగదును విరాళాల రూపంలో ప్రకటిస్తున్నారు.అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిలకు చెరో 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో టాలీవుడ్ లోని మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు, అలాగే ఈ కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు గాను టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు రాష్ట్రాలకి కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు.
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయనిధికి కూడా కోటి రూపాయలు ప్రకటించాడు.దీన్ని ఆదర్శంగా తీసుకున్న టువంటి మరి కొంతమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, టాలీవుడ్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు అనిల్ రావిపూడి, టాలీవుడ్ సినీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు తమకు తోచినంత విరాళంగా ప్రకటించారు.
టాలీవుడ్ స్టార్లు చేస్తున్నటువంటి ఈ మంచి పనికి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి.అంతేగాక దేశంలోని ఏదైనా విపత్తు సంభవించినప్పుడు తమ సహాయ సహకారాలను అందించడంలో సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
.