యూట్యూబ్ లో హాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అనే కార్యక్రమం ద్వారా ఏదో ఒక ఆసక్తికర అంశం చర్చిస్తూ సినీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తెలుగు ప్రేక్షకులతో అప్పుడప్పుడు పంచుకుంటారు.అయితే తాజాగా ఈసారి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి “కొండవీటి దొంగ” అనే చిత్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇందులో భాగంగా మొదటగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలని స్వర్గీయ అందాల తార శ్రీదేవి ను అనుకున్నామని కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె నటించలేదని చెప్పుకొచ్చారు.అయితే ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిందని కానీ కొందరు ఈ ఫ్లాఫ్ అయిందంటూ పలు వదంతులు పుట్టించారని ఈ వదంతులు కాస్త ఆ నోటా ఈ నోటా పాకుతూ తన వరకు వచ్చాయని కూడా తెలిపాడు.
కానీ నీ కొండవీటి దొంగ సినిమా మాత్రం అప్పట్లో చాలా సెంటర్లలో 100 రోజులు ఆడి మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు కథలు అందించిన పరుచూరి బ్రదర్స్ ఈ మధ్య తమ జోరును తగ్గించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు మంచి రైటర్స్ గానే కాకుండా సినీ పరిశ్రమకు తమ వంతు సహాయసహకారాలు అందించే మంచి మనసున్న వ్యక్తులుగా కూడా పేరు తెచ్చుకున్నారు.