గత ఏడాది మార్చి లో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయడం జరిగింది.ఆ సమయంలో అందరు హీరోలు చిన్న స్టార్స్ నటీ నటులు ప్రతి ఒక్కరు కూడా షూటింగ్ లకు బ్రేక్ తీసుకుని ఇంటి కే పరిమితం అయ్యారు.
షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా పెద్ద హీరోలు కొన్ని నెలల పాటు వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు.కరోనా తగ్గిపోయిందని గత ఏడాది చివరి నుండే షూటింగ్ లు ప్రారంభించారు.
ఇటీవలే జోరుగా షూటింగ్ లు జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రతి సినిమా సెట్ లో కూడా కరోనా భయ పెడుతూనే ఉంది.అందుకే షూటింగ్ లు మళ్లీ ఆగిపోయాయి.
ఒకటి రెండు చిన్న హీరోల సినిమాలు మినహా మొత్తం సినిమా లు షూటింగ్ ను నిలిపి వేశారు.ఒక్కరు ఇద్దరు హీరోలు మినహా మొత్తం హీరోలు అంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు.
గత ఏడాది నెలల తరబడి ఇంటికే పరిమితం అయిన స్టార్స్ ఇప్పుడు కూడా మళ్లీ ఇంటికి పరిమితం అవుతున్నట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబు నుండి మొదలుకుని నాని సినిమా వరకు అన్ని సినిమా లను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది.
ఒకటి రెండు సినిమా లు జరుగుతున్నా కూడా ఈ వారం చివరి వరకు వాటిని కూడా ఆపేసే అవకాశం ఉంది.షూటింగ్ లకు ఎలాంటి అడ్డు లేకున్నా కూడా మేకర్స్ కొందరు మాత్రం కరోనా భయంతో సినిమా లకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
అందుకే కరోనా భయం తగ్గి పోయే వరకు కూడా షూటింగ్ లకు వెళ్ల కూడదు అని భావిస్తున్నారు. సీనియర్ హీరోలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక షూటింగ్ లకు మాత్రమే కాకుండా విడుదల కూడా ఆగిపోయాయి.థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు.
కనుక ఈ సమయంలో సినిమా లను విడుదల చేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అంటున్నారు.రెండు నెలల వరకు పెద్ద సినిమా లు విడుదల ఉండక పోవచ్చు.