దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.అధికారుల అంచనాలను మించి రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కు కరోనా నిర్ధారణ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమీరారెడ్డి కరోనా బారిన పడ్డారు.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమీరారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
సమీరా రెడ్డి తన పోస్టులో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించారు.
డాక్టర్ల సలహాలు, సూచనల ప్రకారం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు చికిత్స చేయించుకుంటున్నానని సమీరా రెడ్డి వెల్లడించారు.త్వరలోనే తాను కరోనా నుంచి కోలుకుని అభిమానుల ముందుకు వస్తానని సమీరారెడ్డి పేర్కొన్నారు.
సమీరాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
సమీరాకు కరోనా సోకినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.ప్రస్తుతం సమీరా తన ఫ్యామిలీతో కలిసి గోవాలో ఉన్నారు.పెళ్లి తర్వాత సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
సోషల్ మీడియాలో మాత్రం సమీరా రెడ్డి యాక్టివ్ గా ఉంటున్నారు.తెలుగులో సమీరారెడ్డి జై చిరంజీవ, నరసింహుడు, అశోక్ సినిమాలలో నటించారు.
స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులో సమీరా రెడ్డి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించని సమీరా ఇతర భాషల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించారు.
మరోవైపు కోలీవుడ్ నటుడు అధర్వ తనకు కరోనా సోకిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.వరుసగా సినిమా నటులకు కరోనా సోకుతుండటంతో ఆ ప్రభావం వాళ్లు నటించే సినిమాలపై పడుతోంది.