బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ టీవీ షోల ద్వారా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ షోలో హెబ్బా పటేల్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు.
ఈ షోకు ప్రముఖ నటి ఆమని జడ్జిగా హాజరు కావడం గమనార్హం.సుధీర్ హెబ్బా పటేల్ తో నేను హీరోగా యాక్ట్ చేస్తానని మీరు హీరోయిన్ గా యాక్ట్ చేయాలని చెబుతాడు.
సుధీర్ చెప్పిన మాటలు అర్థం కాని హెబ్బా పటేల్ వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇస్తారు.ఆమని సుధీర్ హెబ్బా పటేల్ కు నచ్చలేదని అనుకుంటున్నానని చెప్పగా హెబ్బా పటేల్ మాత్రం సుధీర్ తనకు బాగా నచ్చాడంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.
ఆ తర్వాత హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన సెలబ్రిటీలు బావలకు హగ్ ఇవ్వాలని చెబుతారు.హెబ్బా పటేల్ ఆదికి ఇవ్వగా ఆది ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.
రామ్ ప్రసాద్ నీకో హగ్ నాకో హగ్ అని చెప్పావ్ కదా అని ఆదితో అంటూ పొజిషన్స్ మార్చుకోగా హెబ్బా పటేల్ మళ్లీ ఆదికే హగ్ ఇస్తుంది.ఆ తర్వాత నరేష్ నాకు ఫ్రెండ్లీ హగ్ కావాలని అడగగా హెబ్బా పటేల్ నరేష్ కు కూడా హగ్ ఇస్తారు.
ఈ ప్రోమోకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ నెల 29వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానుండటం గమనార్హం.
ప్రోమో సూపర్ గా ఉందని సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జై సుధీర్ అన్న అంటూ కొంతమంది కన్నడలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.హెబ్బా పటేల్ చాలా కాలం తర్వాత టీవీ షోలో సందడి చేశారు.గతంతో పోలిస్తే హెబ్బా పటేల్ కు సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.
హెబ్బా పటేల్ తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.