టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ నిన్న జరిగిన నాట్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు.సంధ్య గారు, ఆమె ఫ్యామిలీ తనకు చాలా కాలం నుంచి తెలుసని అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరు కావడానికి అది కారణం కాదని రామ్ చరణ్ అన్నారు.
నేను నాట్యం సినిమాను చూశానని సినిమాలోని మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీ హిట్ అనే సినిమాను కూడా థియేటర్ లో చూసే సమయంలో ఇంటర్వెల్ టైమ్ లో నిద్రపోయి క్లైమాక్స్ లో లేస్తానని తనకు ఈ వింత అలవాటు ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఏ సినిమా అని అడగవద్దని చా పెద్దపెద్ద సినిమాలకు కూడా తాను మధ్యలో పడుకుంటానని అలాంటి నేను నాట్యం సినిమాను మాత్రం ప్రతి సీన్ చూశానని చరణ్ పేర్కొన్నారు.అన్ని కోణాల్లో ఈ సినిమా బాగుంటుందని రామ్ చరణ్ తెలిపారు.
దర్శకుడు రేవంత్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని భావిస్తున్నానని చరణ్ పేర్కొన్నారు.
మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని సినిమాలోని పాటలు చాలా బాగున్నాయని చరణ్ చెప్పుకొచ్చారు.సినిమాలో ఆదిత్య మీనన్ పాత్ర చాలా బాగుందని చరణ్ పేర్కొన్నారు.ఏడు సంవత్సరాల క్రితం సంధ్య గారిని కలిశానని తక్కువ సమయంలోనే సంధ్య నటిగా, నిర్మాతగా మారి సినిమాలో అద్భుతంగా నటించారని చరణ్ చెప్పుకొచ్చారు.
సంధ్య రాజు కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నానని సంధ్య గారి సంకల్పం కోసం ఈ సినిమా చూడాలని చరణ్ అన్నారు.ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకురావాలని చరణ్ వెల్లడించారు.