తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ లకు కి ఉన్నటువంటి క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నాడు.
మరోవైపు నమ్రతా శిరోద్కర్ కూడా తన కుటుంబ బాధ్యతలను చక్కబడుతూ, వ్యాపారాలలో కూడా బాగానే రాణిస్తోంది.
అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో నమ్రత శిరోద్కర్ బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
తాజాగా నమ్రత తన భర్త మహేష్ బాబు మరియు స్నేహితులతో కలిసి మాస్కులు ధరించి తీసుకున్నటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 85 వేల పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.
అంతేగాక కొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోలను తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగులో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో మహేష్ బాబు కి జంటగా మహానటి చిత్ర ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి గీత గోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.