మన ఇండియాలో పెళ్లి అయినా భార్య భర్తలు విడిపోతే భార్యకు భర్త భరణం అనేది ఇస్తారు.ఇవ్వాలి కూడా.
పెళ్లిని నిలుపుకోలేని జంటలు విడిపోవాలని నిర్ణయించు కుంటారు.అలంటి వారు విడిపోయేటప్పుడు భార్య భర్తను భరణం కోరుతుంది.
భర్త ఆస్తిని భట్టి ఆ భరణాన్ని నిర్ణయిస్తారు.పెళ్లి అంటేనే జీవితాంతం కలిసుండాలని ఒకరిపై ఒకరు నమ్మకంతో చేసుకుంటారు.
కానీ పెళ్ళికి ముందే విడిపోతే భరణం అడగ కూడదు అనే అగ్రిమెంట్ పెట్టుకుంటే.నిజంగా ఇలా సాధ్యమా.అది కూడా మన ఇండియాలో.అయితే ఇప్పుడు ఈ విషయంపై ఎందుకు చర్చిస్తున్నారా అని ఆలోచిస్తున్నారా.
చర్చించాల్సిన అవసరం వచ్చింది.ఎందుకంటే పెళ్ళికి ముందే విడిపోతే భరణం అడగకూడదు అనే అగ్రిమెంట్ రాసుకున్నట్టు తెలుస్తుంది.
అది కూడా టాలీవుడ్ జంట అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటివి విదేశాల్లోనే ఉంటాయి.ఈ మధ్య బాలీవుడ్ లో కూడా ఇలాంటివి దర్శన మిస్తున్నాయి.కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హీరో, హీరోయిన్ వాళ్ళ పెళ్ళికి ముందు ఇలా విడిపోతే ఎవ్వరి ఆస్థి ఎవ్వరు అడగకూడదు అని లాయర్ దగ్గర పక్కాగా అగ్రిమెంట్ రాసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ టాలీవుడ్ హీరోకు వారసత్వంగా వేలకోట్ల ఆస్థి ఉంది.ఆ హీరోయిన్ కూడా బాగానే వెనకేసింది.ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది.వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ముందే లాయర్ సమక్షంలో భవిష్యత్తులో విడిపోతే ఎవరు ఆస్తిని ఎవ్వరు అడగకూడదని ఒప్పందం చేసుకున్నారట.
అయితే పెళ్లి అంటేనే కలకాలం కలిసి జీవించాలని కోరుకుంటాం.
అలాంటిది పెళ్ళికి ముందే ఇలా అగ్రిమెంట్ చేసుకోవడం నిజంగా వినడానికి వింతగానే ఉంది.
కలిసి ఉండలేమని ముందే భావించి ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారా.లేదంటే ఇదంతా కేవలం పుకారేనా.
అనేది తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటికి ఆ టాలీవుడ్ జంట విడాకుల రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మరి ఇది ఇలా ఉండగానే ఇంకో కొత్త రూమర్ వచ్చింది.మొత్తానికి వారు వారి లైఫ్ లో ఏం జరుగుతుందో చెప్తేనే కానీ ఈ రూమర్స్ కు చెక్ పడేలా లేదు.
తాజా వార్తలు