సినీ రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.సినిమాలలోని పాత్రలకు అనుగుణంగా హీరోలు, హీరోయిన్లు లుక్ ను మార్చుకుంటూ ఉంటే ఆయా హీరోలు, హీరోయిన్లు అభిమానులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సెలబ్రిటీలు బరువు తగ్గడం ద్వారా వార్తల్లో నిలిచి అభిమానులను మరింత ఆకట్టుకున్నారు.
స్టార్ హీరో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కొంచెం ఎక్కువ బరువుతో కనిపించారు.
ఫలితంగా ఈ సినిమా లుక్ విషయంలో ప్రభాస్ పై ట్రోల్స్ వచ్చాయి.అయితే సలార్ సినిమా కోసం బరువు తగ్గిన ప్రభాస్ ప్రస్తుతం కొత్త లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
మారుతి సినిమాలో, ప్రాజెక్ట్ కె సినిమాలో కూడా ప్రభాస్ కొత్త లుక్ లోనే కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్ర కోసం బరువు పెరిగి కనిపించారు.
అయితే కొరటాల శివ సినిమా కోసం ఇప్పటికే బరువు తగ్గిన ఎన్టీఆర్ ఆగష్టు నాటికి మరింత బరువు తగ్గనున్నారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ ను తర్వాత సినిమాలో ప్రేక్షకులు కొత్త లుక్ లో చూడనున్నారు.
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ కూడా 16 కిలోల బరువు తగ్గి ప్రస్తుతం కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.మరో టాలీవుడ్ హీరో మనోజ్ కూడా 15 కిలోలు బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత క్రమంగా బరువును తగ్గించుకుంటున్నారు.అవికా గోర్, నిత్యామీనన్ కూడా బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం గ్రాఫిక్స్ తో బరువు పెరిగినా లుక్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.