బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగులో స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన నాలుగు సీజన్లు సక్సెస్ కాగా ఐదో సీజన్ గత సీజన్లను మించి ఉండేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
అయితే సీజన్ 5 ప్రారంభం కావడానికి చాలా సమయమే ఉన్నా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.
టిక్ టాక్ దుర్గారావు, షణ్ముఖ్ జశ్వంత్, హైపర్ ఆది, యాంకర్ రవి బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా తాజాగా సింగర్ సునీత బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారంటూ జరుగుతుండటం గమనార్హం.
ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని సింగర్ సునీత వార్తల్లో నిలిచారు.పెళ్లి తరువాత సునీత టీవీ షోలలో, ఈవెంట్లలో పాల్గొంటున్నారు.
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు సునీతను సంప్రదించినా సునీత బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి సీజన్ లో ఒక సింగర్ ను తీసుకున్నారని.ఈ సీజన్ లో సునీతకు ఛాన్స్ దక్కనుందని వెల్లడిస్తున్నారు.అయితే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిందే.
సీజన్ 4 ప్రారంభానికి ముందు సైతం బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారని చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించగా ఆ జాబితాలో ఉన్న సెలబ్రిటీలలో కొందరు మాత్రమే బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు.మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5లో ఫేమ్ ఉన్న సెలబ్రిటీలనే తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొంటారో చూడాల్సి ఉంది.