తెలుగులో తన పాటలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ప్రముఖ సింగర్ ప్రణవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సింగర్ ప్రణవి మొదట్లో పలు పాటల పోటీలలో కూడా పాల్గొని బహుమతులను కూడా గెలుచుకుంది.
అయితే తాజాగా సింగర్ ప్రణవి తన భర్త ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో సింగర్స్ కి ఇచ్చేటువంటి పారితోషకం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో ముఖ్యంగా సినిమాల్లో పాటలు పాడే వారికి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందని కొందరు అపోహ పడుతున్నారని ఇది నిజం కాదని తెలిపింది. నిజానికి ఒక సినిమాలో పాట పాడడానికి 5 వేల రూపాయలు ఇస్తారని అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలు అయితే 3 వేలు, 2 వేలు అంటూ బేరసారాలు చేస్తారని చెప్పుకొచ్చింది.
అయితే తాను సినిమా పరిశ్రమలో సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన మొదట్లో తాను పాడిన పాటలకి ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ పాడినట్లు ఆమె పేరుని కూడా పెట్టారని, ఒక్కోసారి తనకు చెప్పకుండానే కొంతమంది తాను పాడిన పాటలకి వేరే గాయనిల పేర్లను పెట్టుకున్నారని అది సినిమా పరిశ్రమలో పెద్ద విషయమేమీ కాదని తెలిపింది.
అయితే సినిమా పరిశ్రమలో సింగర్ చిత్ర మరియు శ్రేయ ఘోషల్ వాయిస్ కి తన వాయిస్ కొద్దిగా దగ్గరగా ఉండడంతో అలా చేశారని కూడా తెలిపింది.
అయినప్పటికీ తనకు ఏమీ బాధ లేదని తన పాట అందరూ వింటారనే సంతృప్తి తనకు చాలని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సింగర్ ప్రణవి పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.
అయితే తాజాగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రఘు మాస్టర్ బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే గతంలో కూడా తన భార్యతో కలిసి రఘు మాస్టర్ బిగ్ బాస్ లో పలు వార్తలు వినిపించగా అవి నిజం కాదని అంటూ కొట్టిపారేశారు.మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై రఘు మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.