అమ్మ అవ్వడం ఎంతో పెద్ద వరం.ఆడ జన్మ అంటేనే అమ్మ అవ్వడం.
సాధారణ మహిళల నుంచి స్టార్ సెలెబ్రిటీ అయినా కూడా అమ్మ అవ్వాలనే తహ తహ ఖచ్చితంగా ఉంటుంది.ఒకసారి తల్లి అయ్యారంటే వారిలో అందం పోయినా సరే ఖచ్చితంగా అమ్మ అవ్వాలని, ఆ మధురానుభూతిని పొందాలని ప్రతి మహిళ కూడా కోరుకుంటుంది.
అయితే చాలామంది హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో గర్భవతులుగా ఉన్నప్పటికీ బుల్లితెర తారలు కూడా కొంతమంది ప్రస్తుతం గర్భం దాల్చారు.వారెవరో ఇప్పుడు చూద్దాం.
వైష్ణవి
రుక్మిణీ కళ్యాణం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయింది వైష్ణవి. ఇటీవలే ఒక సీరియల్ దర్శకుడుని ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో హ్యాపీ గా సెటిల్ అయిపోయింది.
అలాగే తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెడుతూ బిజీగా ఉన్న వైష్ణవి ప్రస్తుతం గర్భం దాల్చింది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.ఇక పెళ్లయిన తర్వాత వెంటనే సీరియల్స్ కి గుడ్ బై కూడా చెప్పేసింది వైష్ణవి.
లాస్య
యాంకర్ లాస్య బుల్లి తెర ప్రేక్షకులకు అందరికి బాగా పరిచయం.ఆ మధ్య కాలంలో మంజునాథ్ అనే వ్యక్తి ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పటికే ఒక బిడ్డకు తల్లి అయిన లాస్య ఇప్పుడు మరోసారి గర్భం దాల్చింది.ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించింది.
తన పెళ్లి తర్వాత యాంకరింగ్ మానేసిన లాస్య షోస్ లో, కామెడీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది.
శ్వేతా
ఈటివి లో ప్రసారం అవుతున్న శత మనం భవతి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా తెలుగు నటి శ్వేతా. ఈ సీరియల్ ద్వారా నటి గా మొదటి సారి ఇంట్రొడ్యూస్ర్ అయినా శ్వేతా ప్రస్తుతం గర్భవతి గా ఉంది.దాంతో ఈ సీరియల్ నుంచి ఆమె తప్పుకుంది.
అంతే కాదు ఆమె గర్భవతి అనే విషయం కూడా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించింది.