తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “సొంతం” అనే చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన సీనియర్ హీరో రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే రోహిత్ అంటే ఇప్పటి సినీ అభిమానులకు తెలియకపోవచ్చు గాని 90 సంవత్సర కాలం లోని ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుంటాడు.
తాజాగా రోహిత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో ముఖ్యంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో నటించిన సొంతం, గర్ల్ ఫ్రెండ్, గుడ్ బాయ్, కీలుగుర్రం, జానకి వెడ్స్ శ్రీరామ్, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయని తెలిపాడు.కానీ ఒకానొక సమయంలో ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు.
అంతేగాక కర్నూలు జిల్లాలోని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆహ్వానం కూడా అందిందని కానీ తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేనందున వారి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు.ఇటీవలే తన బంధువులకు తెలిసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
అంతేగాక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు ఒకప్పుడు సినీ పరిశ్రమలోని ప్రముఖ డైరెక్టర్లతో పని చేశారు కదా వారు ఎప్పుడు అవకాశాల కోసం సంప్రదించ లేదా అంటూ అడిగాడు.ఈ విషయంపై రోహిత్ స్పందిస్తూ మామూలుగా అయితే దర్శకులు తాము సిద్ధం చేసుకున్న కథలో నటించే నటీనటుల లను ముందుగానే ఊహించుకుంటారని ఒకవేళ వారి పాత్రలకు మనం సూట్ అవుతామంటే వాళ్లే వచ్చి మనల్ని సంప్రదిస్తారని ఈ విషయం తాను బాగా నమ్ముతానని తెలిపాడు.
ఏదేమైనప్పటికీ మంచి హీరోగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి రోహిత్ వ్యాపారాల కారణంగా అవకాశాలు కోల్పోయాడని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
.