టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురి అయినట్టు తెలుస్తుంది.ఇంట్లో నాలుగు రోజుల క్రితం కైకాల జారీ పడ్డారట.
దీంతో నొప్పి ఎక్కువుగా ఉండడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వయసు 87 ఏళ్ళు.
ఈయన కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామాలో 1935 జులై 25 న లో జన్మించారు.
కైకాల కు ఏప్రిల్ 10 1960 లో నాగేశ్వరమ్మ తో వివాహం జరిగింది.
ఈయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ఈయన తన సినీ జీవితంలో ఎన్నో మరపు రాని సినిమా లలో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందు కున్నాడు.1959 లో ‘సిపాయి కూతురు’ అనే సినిమా తో కైకాల సినీ రంగ ప్రవేశం జరిగింది.ఆయన ఎస్ వి రంగారావు తర్వాత వైవిధ్య మైన పాత్రలు పోషించిన నటుడి గా టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు.
ఈయన సీనియర్ హీరో లందరి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.గత 60 సంవత్సరాలు గా కైకాల టాలీవుడ్ లో 777 సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన ఒక పాత్ర అనే కాకుండా సినిమాలో ఏ పాత్ర ఇచ్చిన దానికి న్యాయం చేసేవాడు.అందుకే ఈయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును ఇచ్చారు.
ఇక ఈయన నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారీ పడగా శనివారం ఎక్కువ నొప్పి రావడంతో సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్నాడు.
తాజా వార్తలు