తెలుగు నిర్మాతల మండలి నుండి ఇటీవల ఒక ప్రెస్ నోట్ విడుదల అయింది.ఆ ప్రెస్ నోట్ తో తీవ్ర దుమారం రేగుతోంది.
డబ్బింగ్ సినిమా లకు థియేటర్లు ఇవ్వద్దు అంటూ నిర్మాతలు థియేటర్ల యొక్క యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వడం తో వివాదం మొదలైంది.చిన్న నిర్మాతలు మాత్రమే ఈ విషయమై సంతృప్తిగా ఉంటారని పెద్ద నిర్మాతలు మాత్రం డబ్బింగ్ సినిమాల విషయం లో నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడతారని అంతా భావించారు.
అన్నట్లుగానే దిల్ రాజు మొదలుకొని పలువురు నిర్మాతలు బడా హీరో లతో సినిమా లు నిర్మించే నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మన సినిమా లను వేరే భాషల్లో విడుదల చేసుకుంటున్నప్పుడు వేరే భాష ల సినిమా లను కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్వేచ్ఛగా విడుదల చేసుకునే వెసులు బాటు కల్పించాలని.
లేదంటే మన సినిమా లకు అక్కడ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ మధ్య కాలం లో పెద్ద నిర్మాతలు ఏ సినిమా తెరకెక్కించినా అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.అలాంటి పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు డబ్బింగ్ సినిమాల యొక్క రిలీజ్ విషయమై నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.తమ సినిమా లు అక్కడ విడుదల అవ్వాలంటే వారి సినిమా లు ఇక్కడ విడుదల అవ్వాలి.
ఆ పద్ధతినే పలువురు నిర్మాతలు అవలంబిస్తున్నారు.కనుక ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సంక్రాంతి కి పోరు రసవత్తరంగా ఉన్న సమయం లో దిల్ రాజు నిర్మించిన తమిళ సినిమా వారసుడు తెలుగు లో డబ్బింగ్ సినిమా గా విడుదల కాబోతుంది.కనుక దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది.
నిర్మాతల మండలి నుండి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.